ఆక్రా మర్కుడు!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారి పల్లె అనే చిన్న గ్రామంలో ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.
తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు.
సమితి స్థాయిలో యువజన అద్యక్షపదవితో రాజకీయజీవితం ఆరంభించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, తొలిసారిగా టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొంది తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి.
తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1982 లో యన్.టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగానే ఉన్నాడు.
మామను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
ఆ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మ్రోగించాక తెలుగుదేశం పార్టీ లోకి చేరినాడు.
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మి పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది
ఆంధ్రుల అన్నగారు రామారావు గారి మరణం తరువాత చంద్ర బాబు వెను తిరిగి చూడలేదు చేతిలో పదవి ఉండటం తో అయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది.
పదవిని అడ్డు పెట్టుకుని దేశాన్నే దోచుకున్నాడు ఆయనకు మన దేశం లోనే కాదు విదేశాల్లో కూడా ఆస్తులున్నాయని సమాచారం.
తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్టు వై . ఎస్ . విజయమ్మ గారి పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు CBI విచారణకు స్వీకరించింది.
ఒకవేళ నేరం రుజువైతే బాబు జైలు జీవితాన్ని గడపటం తప్పాడు.
- ఇలాంటి అక్రా మార్కులు మనకు అవసరమా ?
- నేర రాజకీయాలకు పట్టం కట్టే వాళ్ళు మనకెందుకు !!!
- ఆలోచించండి కొత్తవాళ్ళకు అవకాసం ఇచ్చి చుడండి
- యువతరాన్ని ప్రోస్తాయించండి....
మీ....
ప్రసాద్
....................
No comments:
Post a Comment